Monday 5 November 2012

కాంగ్రెస్‌, టీడీపీల కుట్రతోనే జగన్‌కు జైలు

4Ga

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల కుట్రల ఫలితం గానే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జైలు కెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు చెప్పి నట్లు నడుచుకోకపోవడం వల్లే జగనన్నను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్‌ షర్మిల అన్నారు. షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉరవకొండ నుండి ప్రారం భమై వజ్రకరూర్‌ మండలం రాగుల పాడు వరకు కొన సాగింది. రాగుల పాడులో రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీలు తప్ప మూడో పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు నీచమైన కుట్రలకు పాల్పడుతున్నాయని ఆమె నిప్పులు చెరిగారు. హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు. చంద్రబాబుపై ఆమె విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌, టీడీపీల కుట్రలను చేధించు కుని త్వరలోనే జగన్‌ బయటికి వస్తారని షర్మిల అన్నారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...