
ఎక్కువగా కుంటు వ్యాధి వస్తుంది. ఇంతకుముందు మందుల సరఫరా బాగుండేది. ఇప్పుడు మందులు దొరకడం లేదు.
రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాకు కార్పొరేషన్(గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య) ఉండేది. దాని ద్వారా రుణాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రాజశేఖరరెడ్డి లేరు. ఆ కార్పొరేషనూ లేదు" అని అతగాడు చెప్పాడు.ఇందుకు స్పందించిన షర్మిల మాట్లాడుతూ " ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి ఢిల్లీ పోవడానికే సరిపోతోంది. ఇక మీ గురించి ఆయనేం పట్టించుకుంటారు? వ్యవసాయం బాగాలేనప్పుడు రైతులు ప్రత్యామ్నాయ ఆదాయం పొందాలని రాజన్న పశువుల పెంపకం కోసం లోన్లు ఇచ్చాడు. గొర్రెలు, మేకల పెంపకం దారులకు బీమా వసతి కల్పించాడు. కానీ ఈ ప్రభుత్వానికి అంతటి పెద్ద మనసేది? కిరణ్కుమార్రెడ్డి లాగానే అధికారులు కూడా ఉన్నారు. జగనన్న సీఎం కాగానే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు బీమా అందుతుంది. పశుగ్రాసం, నీటికి కొదవుండదు. వైద్యం కోసం సంచార వైద్యశాలలు అందుబాటులోకి తెస్తాడు. రుణాలూ ఇస్తాడు. కార్పొరేషన్ బాగా పనిచేసేలా చూస్తాడు. ధైర్యంగా ఉండండన్నా." అంటూ భరోసా ఇచ్చారు. .
No comments:
Post a Comment