‘‘ చంద్రబాబు గారూ .. మీ కుమ్మక్కు రాజకీయాలు చూడలేక, మీ మీద నమ్మకం
లేకనే మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు. వాళ్లకు
మనస్సాక్షి ఉంది కాబట్టే.. నిజాయతీ పక్షాన నిలబడాలనుకున్నారు. అందుకే..
జగనన్నకు అండగా నిలబడుతున్నారు. జీవితంలో ఏనాడూ నిజం మాట్లాడలేని మీరు ఈ
నిజాన్ని దాచిపెట్టి మేం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామని అబద్ధపు
ప్రచారం చేస్తున్నారు." అని షర్మిల అన్నారు . ‘మరో
ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 33వ రోజు సోమవారం కర్నూలు జిల్లా కోడుమూరు
నియోజకవర్గంలో సాగింది. జగన్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ
కేసులు బనాయించి జైల్లో పెట్టినందుకు నిరసనగా గూడూరులో వేలాది మంది ప్రజలు
నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిల పాదయాత్రలో కదంతొక్కారు. గూడురు సభలో ఆమె
ప్రసంగిస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని చంద్రబాబు ఆదివారం
చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
" మాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అనుభవం.. రహస్య ఒప్పందాలు చేసుకునే చరిత్ర మీకే ఉంది., పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను హోటల్లో బంధించావు. కొందరిని బెదిరించావు, కొందరిని కొన్నావు. ఇదేనా మీ పరిపాలనా దక్షత?’’ అని షర్మిల బాబుపై నిప్పులు చెరిగారు.
" మాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అనుభవం.. రహస్య ఒప్పందాలు చేసుకునే చరిత్ర మీకే ఉంది., పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను హోటల్లో బంధించావు. కొందరిని బెదిరించావు, కొందరిని కొన్నావు. ఇదేనా మీ పరిపాలనా దక్షత?’’ అని షర్మిల బాబుపై నిప్పులు చెరిగారు.
No comments:
Post a Comment