Wednesday 14 November 2012

సుమలతకు అండగా

కర్నూలు జిల్లా బిణిగేరకు చెందిన సుమలత అనే పదేళ్ల చిన్నారి వాళ్ల నాయనమ్మతో కలిసి షర్మిలను చూసేందుకు వచ్చింది. స్కూలుకు వెళ్తున్నావా చిన్నా అని షర్మిల అడగగా  ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. ఐదో తరగతి వరకు చదువుకున్నానని, ఈ ఏడాదే చదువు మానేశానని, తల్లిదండ్రులిద్దరూ బండలు కొట్టే పనిచేస్తారని, తనను చదివించలేరని ఏడ్చింది. దీంతో చలించిపోయిన   షర్మిల... పాప, నాయనమ్మల కన్నీళ్లు తుడుస్తూ "నేను చదివిస్తానమ్మా" అంటూ ఓదార్చారు. ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మనూరు జయరాం ఆ పాపను చదివించేందుకు ముందుకొచ్చారు. పాపను స్కూల్‌లో చేర్పిస్తానని మాటిచ్చారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...