కర్నూలు జిల్లా బిణిగేరకు చెందిన సుమలత అనే పదేళ్ల చిన్నారి వాళ్ల
నాయనమ్మతో కలిసి షర్మిలను చూసేందుకు వచ్చింది. స్కూలుకు వెళ్తున్నావా
చిన్నా అని షర్మిల అడగగా ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. ఐదో తరగతి వరకు
చదువుకున్నానని, ఈ ఏడాదే చదువు మానేశానని, తల్లిదండ్రులిద్దరూ బండలు కొట్టే
పనిచేస్తారని, తనను చదివించలేరని ఏడ్చింది. దీంతో చలించిపోయిన షర్మిల...
పాప, నాయనమ్మల కన్నీళ్లు తుడుస్తూ "నేను చదివిస్తానమ్మా" అంటూ ఓదార్చారు.
ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మనూరు జయరాం ఆ పాపను చదివించేందుకు
ముందుకొచ్చారు. పాపను స్కూల్లో చేర్పిస్తానని మాటిచ్చారు.

No comments:
Post a Comment