షర్మిలకు శుక్రవారం రాత్రి నుంఛి జ్వరం రావడంతో కొద్దిగా నీరసించారు.
రాత్రి 101.8 డిగ్రీల జ్వరం ఉందని, రెండు రోజులుగా తీవ్ర జలుబు,
గొంతునొప్పితో బాధపడుతున్నారని షర్మిల చిన్నాన్న కుమారుడు, వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రానికి జ్వరం
కాస్త తగ్గిందన్నారు. ఉదయం అనంతపురం నుంచి రిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్
వెంకటేశ్వరరావు షర్మిలకు వైద్య పరీక్షలు చేశారు. సాయంత్రం పులివెందుల నుంచి
వైద్య నిపుణులు, వైఎస్ జగన్ మామ, అత్తగార్లు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి,
డాక్టర్ సుగుణమ్మ వచ్చి షర్మిలను పరీక్షించారు. షెడ్యూలు ప్రకారం షర్మిల
శనివారం 13.8 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా.. 8.5 కిలోమీటర్లు మాత్రమే
నడవగలిగారు. పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యే
కాపు రాంచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, మరో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఆయన
సతీమణి మాధవి, వాసిరెడ్డి పద్మ తదితరులు నడిచారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు
వైఎస్ విజయమ్మ సాయంత్రం కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment