Friday, 26 October 2012

షర్మిల వెంట వైఎస్ వీరాభిమానులు

గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన గజ్జల కృష్ణారెడ్డి చెప్పులు లేకుండానే షర్మిల వెంట నడుస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడుస్తానని ఆయన తెలిపారు. వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోట మండలం నుంచి 500 కిలోమీటర్లు నడిచినట్లు తెలిపారు. వైఎస్‌ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన పాదయాత్రలో పాల్గొన్నానని, ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం నడుస్తున్నానని చెప్పారు.
అభిమానమే నడిపిస్తోంది:     ప్రకాశం జిల్లా ఇరుసులగుండానికి చెందిన సుబ్బారెడ్డి వైఎస్ వీరాభిమాని. మహానేతఅధికారం చేపట్టిన మొదటి సంవత్సరమే పొగాకు పంటకు గిట్టుబాటు ధర రావడంతో లాభపడ్డారు. నాటినుంచి వైఎస్ ఏం చేసినా మద్దతిచ్చారు. అదే అభిమానంతో ఇప్పుడు షర్మిలతోపాటు ఇచ్ఛాపురం వరకు నడుస్తున్నారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...