Wednesday 24 October 2012

అనంతకు చేరుకున్న మరో ప్రజాప్రస్థానానికి అపూర్వ స్వాగతం

 
వైఎస్సార్ తనయ, జగన్ సోదరి, వైఎస్సార్ జిల్లా ఆడపడుచు షర్మిలకు ఆ జిల్లా ప్రజలు సరిహద్దుల్లో ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. మంగళవారం పార్నపల్లిలో బహిరంగ సభతో జిల్లాలో యాత్ర పూర్తయింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడి వంతెన దాటే సమయంలో జిల్లా మహిళలు షర్మిలకు గాజులు, కుంకుమ, పూలతో సాంప్రదాయకంగా వీడ్కోలు పలికారు. జిల్లా ప్రజలు ఆదరించిన తీరుకు షర్మిల శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఐదున్నర రోజుల్లో 82.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లాకు చేరుకున్న మరో ప్రజాప్రస్థానానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికి షర్మిలను అక్కున చేర్చుకున్నారు. దాదాపు 10 వేల మంది ప్రజలు సరిహద్దులోకి వచ్చి స్వాగతం పలికారు. యాత్ర ప్రవేశించిన దాడితోట నుంచి షర్మిల బసచేసిన ప్రాంతం వరకు జనం బారులు తీరి ఆత్మీయంగా ఆదరించారు. జిల్లా ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...