Thursday 25 October 2012

షర్మిలను ఆదరిస్తున్నఅనంత ప్రజలు

జగన్ సోదరి షర్మిల  ఏడోరోజు పాదయాత్ర అనంతపురంజిల్లాలోని దాడితోటలో ప్రారంభమై శివంపల్లిలో ముగిసింది. ఏడోరోజున షర్మిల 15 కిమీ నడిచారు. మరో ప్రజాప్రస్థాన యాత్ర వంద కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. ఈ ఏడు రోజుల్లో మొత్తం 106 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల ప్రజల సమస్యలపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. త్వరలో రానున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పాలనలో ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు.
 షర్మిలను అనంత ప్రజలు ఆప్యాయంగా ఆదరిస్తున్నారు.  రాజకీయ కుటుంబ సభ్యురాలికి ఘనస్వాగతం పలుకుతున్నారు. మరో ప్రజాప్రస్థాన పాదయాత్రలో అడుగులో అడుగేస్తూ మద్దతుగా నడుస్తున్నారు. ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు ఓపిగ్గా తెలుసుకుంటూ వాటికి తనదైన రీతిలో స్పందిస్తూ షర్మిల ముందుకు కదులుతున్నారు.  చిల్ల కొండయ్యపల్లి గ్రామస్థులతో మాట్లాడిన షర్మిల హంద్రీనీవా పనుల ముగింపులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.. 
చిల్లకొండయ్యపల్లినుంచి బయలుదేరిన షర్మిల తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామంలో ఓ సామాన్యురాలి ఇంట్లో దసరా పండగ జరుపుకున్నారు. ఇక్కడి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుడి పక్కనే ఉన్న  పూజారి భార్య వరాలు ఇంటికి వెళ్లారు. వరాలు దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబానికి అండగా వున్నారు. అనుకోని అతిథిని చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వరాలు...షర్మిలను సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. తాను చేసుకున్న పిండివంటలు, తీపి పదార్థాలను తినిపించారు.
అనంతరం తాడిమర్రి చేరుకున్న షర్మిల ఇక్కడ ఏర్పాటైన బహిరంగసభలో మాట్లాడారు. సకాలంలో కరెంటు రాక, ఆరోగ్యశ్రీ అందక..ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ వస్తుందో రాదో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అటు కాంగ్రెస్ ఇటు టిడిపి చోద్యం చూస్తున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం  చేసారు. అక్కడనుంచి శివంపల్లికి చేరుకున్న షర్మిల ఈ గ్రామ ప్రజల సమస్యలన్నింటిని సావధానంగా విన్నారు. తాగునీటి సమస్యను తీర్చడానికి తమ పార్టీ నేత మర్రి చంద్రశేఖరరెడ్డి సాయం చేస్తారని హామీఇచ్చారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అందక చదువాపేసిన జగదీశ్వరరెడ్డి అనే వికలాంగుని దుస్థితి తెలుసుకొని అతని ఎంబిఏ కోర్సు పూర్తవ్వడానికి ఆర్థిక సహాయం అందిస్తానని షర్మిల భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...