వైఎస్సార్ జిల్లాలో ఐదున్నర రోజులు 82.5
కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ
వీలైనప్పుడల్లా ఐదు రోజుల పాటు పాదయాత్రలో పాల్గొనగా.. పార్టీ నేత వైవీ
సుబ్బారెడ్డి పూర్తిస్థాయిలో పాదయాత్రలో కొనసాగుతున్నారు. వైఎస్సార్ జిల్లా
ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, కె.శ్రీనివాసులు
పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి కూడా పాదయాత్రలో
పాల్గొన్నారు. ఇక పొరుగు జిల్లాల నుంచి పలువురు శాసనసభ్యులు యాత్రలో ఒకటి
రెండు రోజులు నడిచారు. వీరిలో బాలినేని శ్రీనివాస్రెడ్డి, శోభానాగిరెడ్డి,
మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, గురునాథ్రెడ్డి,
ప్రసన్నకుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి
రెండు రోజులు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి సతీమణి
కాపు భారతి మొదటి నుంచీ నడుస్తున్నారు. ఎమ్మెల్సీలు శేషుబాబు, దేశాయి
తిప్పారెడ్డి తదితరులు వైఎస్సార్ జిల్లాలో పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ
మంత్రి కొండాసురేఖ, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్రెడ్డి
తదితరులు తొలి మూడురోజులు యాత్రలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment