Thursday 18 October 2012

జగనన్న వదిలిన బాణాన్ని..... షర్మిల

రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికురాలిగా మీ ముందుకొస్తున్నా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నానని షర్మిల తెలిపారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని...ప్రజా సమస్యల పరిష్కారానికి   అందరూ ముందుకు  రావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ మరో ప్రజా ప్రస్థానానికి రెండే ప్రధాన అంశాలని ....ఒకటి అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, రెండోది అసమర్థ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీయటమే లక్ష్యమన్నారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తాను నల్లబ్యాడ్జి పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆమె కోరారు. ప్రతి అడుగులో నాన్నను ,అన్నను తలచుకుంటూ  ప్రజల కష్టాలను తెలుసుకుంటానని చెప్పారు.వైయస్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా క్షోభ పెడుతోందని ఆమె విమర్శించారు. రైతులను నిర్లక్ష్యం చేసిందని, విద్యార్థులను దెబ్బ తీసిందని, విద్యుత్ సంక్షోభం ఘోరంగా ఉందని ఆమె అన్నారు. ఈ రోజు రైతుల కోసం చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబుకి గానీ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయి జగనన్నపై కేసులు పెట్టించారని, జగనన్నను జైల్లో పెట్టించారని ఆమె ఆరోపించారు. చీకట్లో చంద్రబాబు చిదంబరాన్ని కలిసి తనపై కేసులు లేకుండా చంద్రబాబు మేనేజ్ చేసుకున్నారని ఆమె అన్నారు.బాబు పై షర్మిల తీవ్ర స్తాయిలో విమర్శలు చేసారు .సభ ముగిసిన తర్వాత షర్మిల పాదయాత్ర మొదలైంది.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...