Wednesday 17 October 2012

ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పాద యాత్ర

ప్రజలకు మాట ఇవ్వడానికి  నాడు  వైయస్‌ పాదయాత్ర చేశారు.
అదొక ప్రజాప్రస్థానం.
ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి వైయస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర చేశారు.అది ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రస్థానం. ప్రజల బాగోగులను గాలికొదిలేసిన సర్కారును నిలదీసేందుకు
గురువారం నుంచి వైయస్‌ కుమార్తె షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇది మరో ప్రజా ప్రస్థానం. సందర్భాలు మారినా.. వ్యక్తులు మారినా ఆ కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఒక్కటే. ప్రజలపట్ల ఆ కుటుంబానికి ఉన్న బాధ్యత ఒక్కటే. ప్రజల్లో వారికున్న విశ్వసనీయత ఒక్కటే.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పడకేసింది..పేద విద్యార్థులకు పెద్దచదువులు దూరమయ్యాయి..విద్యుత్‌ కరువయ్యింది. రైతుల పంటలు ఎండుతున్నాయి. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది. 108, 104 వాహనాలు మూలనపడ్డాయి. పేదల బతుకుల్లో వెలుగులు మాయమయ్యాయి. వైఎస్‌ ఉన్నప్పుడు ఎంతో భరోసా...ఇపుడు బతుకే భారం..మనసుంటే మార్గం ఉంటుంది..కానీ.. బడుగు జీవులను ఆదుకోవాలన్న ఆ మనసే లేకపోతే...ఇప్పుడు కాంగ్రెస్‌లో అదే లోపిస్తోంది...ప్రజాసమస్యల్ని సర్కారు గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టీడీపీ తనకేమీ పట్టనట్టుంది. అందుకే ప్రజాసమస్యలపై మహానేత కూతురు షర్మిల  పోరాటం చేపట్టారు. మరోప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
తన పాదయాత్రలో ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ... సర్కారు తీరును ఎండగడుతూ ముందుకు సాగనున్నారు...
ప్రజాసమస్యలపై నిరంతర పోరాటాల్లో భాగంగా పాదయాత్ర చేయాలని జగన్ ఇదివరకే నిర్ణయించుకున్నారని ఆ బాధ్యతను షర్మిల చేపడుతున్నారన్నారు  వైఎస్‌ విజయమ్మ.
చిన్నప్పట్నుంచి తన తండ్రి రాజకీయాలను దగ్గరుండి చూసిన షర్మిలకు ప్రజల్లోకి వెళ్లడం, మాట్లాడటం కొత్తకాదు, ఇంటా బయటా నిరంతరం తన తండ్రి చుట్టూ వుండే ప్రజలను దగ్గరగా గమనించిన ఆమె కడప ఉపఎన్నికల సమయంలోనే గడపగడపకు ప్రచారం నిర్వహించి ప్రజల మనసు గెలుచుకున్నారు. మొన్నటికి మొన్న జరిగిన ఉపఎన్నికల్లోనూ ప్రభంజనాన్నే సృష్టించారు షర్మిల . తండ్రిపోలికలే కాదు, ఆయన ఆలోచల్ని వారసత్వంగా పొందిన షర్మిల మరో ప్రజాప్రస్థాన పాదయాత్రతో అధికార కాంగ్రెస్‌ అసమర్ధత పాలనపై, ఆపాలనకు మద్దతుగా నిలిచిన ప్రధాన ప్రతి పక్ష అవకాశవాద రాజకీయాలపైనా ధ్వజమెత్తనున్నారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ పాదయాత్రలో జనంతో మమైకం కానున్నారు షర్మిల . ప్రజా సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసన తెలుపుతూ నల్లబ్యాడ్జిలు, నల్లరిబ్బన్లు చేతికి కట్టుకుని ముందుకు సాగనుంది షర్మిల . ఈ పాదయాత్ర ఆద్యంతం ప్రజాసమస్యల సాధనే లక్ష్యంగా సాగనుంది.
తెలంగాణ జిల్లాల్లో కూడా కొనసాగే ఈ మరో ప్రజాప్రస్ధానంతో పాటు ఓదార్పు కూడా ఆపబోమని విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్‌ కుమార్తెగా, జగన్‌ చెల్లెలుగా షర్మిల చేసే పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు. తమలో మహనేత రక్తమే ప్రవహిస్తుందని... వైఎస్‌ను నమ్మిన ప్రతిఒక్కరూ షర్మిలను కూడా నమ్మి ఆశీర్వదిస్తారని విజయమ్మ చెప్పారు.
పేదవాళ్ల కష్టాల్ని కళ్లతో కాదు.. మనసుతో చూశారు  వైఎస్.తన  పాదయాత్ర సందర్భంగా ప్రతిఒక్కరి సమస్యల్ని అధ్యయనం చేశారు. వైఎస్   చూపిన మార్గంలోనే ఆయన  కూతురు ప్రజల్లోకి రానున్నారు. ప్రజలకు మద్దతుగా నేనున్నానంటూ నిలవనున్నారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...